More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ అధికారుల ముందుకు ఆంధ్రజ్యోతి...

    Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ అధికారుల ముందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్​ అధికారులు విచారణ వేగవంతం చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎస్​ఐబీ చీఫ్​ ప్రభాకర్​రావు(SIB Chief Prabhakar Rao), ప్రణీత్‌రావు(Praneeth Rao) ఆధ్వర్యంలో వేలాది మంది ఫోన్లు ట్యాప్​ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్​రావుతో పాటు ప్రణీత్​రావును అధికారులు విచారిస్తున్నారు. వారి విచారణలో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

    బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారులు, జర్నలిస్ట్​లు, పలువురు అధికారుల ఫోన్లను ట్యాప్​ చేశారు. బీఆర్​ఎస్​ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో సిట్​ అధికారులు ఫోన్​ ట్యాపింగ్​కు గురైన బాధితుల స్టేట్​మెంట్​ కూడా రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ(Andhra Jyothi MD Radhakrishna) వాంగ్మూలం సేకరించారు. ఏసీపీ వెంకటగిరి(ACP Venkatagiri) గంట పాటు రాధాకృష్ణ స్టేట్మెంట్ రికార్డు చేశారు.

    READ ALSO  Bandi Sanjay | కేసీఆర్​ ఢిల్లీలో మూటలు అప్పజెప్పారు.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Phone Tapping Case | చర్యలుంటాయా!

    ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సిట్​ అధికారులు(Sit Officers) దూకుడు పెంచారు. నిందితులను విచారించడంతో పాటు బాధితుల స్టేట్​మెంట్​ రికార్డు చేస్తున్నారు. కాంగ్రెస్​కు చెందిన 200 మంది నాయకుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు సిట్​ గుర్తించింది. అయితే బాధితులు అందరూ కూడా కేసీఆర్(KCR)​, కేటీఆర్(KTR) చెబితేనే తమ ఫోన్లు ట్యాప్​ చేశారని చెబుతున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు ప్రభాకర్​ రావు డీజీపీ ఆదేశాల మేరకు ట్యాపింగ్​ చేసినట్లు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు గతంలో పని చేసిన డీజీపీని కూడా సిట్​ అధికారులు విచారించే అవకాశం ఉంది.

    ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)​ వెనక ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన విద్యుత్​ కమిషన్​ విచారణ ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)​ నివేదిక రాలేదు. ఫార్ములా ఈ కార్​ రేస్​ కేసు విచారణ కూడా నెలలుగా కొనసాగుతోంది. దీంతో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కేసీఆర్​, కేటీఆర్​ను అరెస్ట్​ చేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. లేదంటే కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని డిమాండ్​ చేస్తున్నారు. మరి ఈ కేసులో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

    READ ALSO  Govt Employees | ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం

    Latest articles

    Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్‌ నిఫ్టీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఆల్‌టైం హై దిశగా అడుగులు...

    Tenth Supplementary Results | టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenth Supplementary Results | తెలంగాణ(Telangana)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి....

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక - కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara...

    CDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..!

    అక్షరటుడే, కామారెడ్డి: CDC Chairman | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ (CDC...

    More like this

    Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్‌ నిఫ్టీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఆల్‌టైం హై దిశగా అడుగులు...

    Tenth Supplementary Results | టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenth Supplementary Results | తెలంగాణ(Telangana)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి....

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక - కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara...