ePaper
More
    HomeతెలంగాణKTR | రాష్ట్రంలో అరాచక పాలన.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    KTR | రాష్ట్రంలో అరాచక పాలన.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KTR | రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​(BRS Working President KTR) అన్నారు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ఆయన సీఎం రేవంత్​రెడ్డికి సవాల్​ విసిరిన విషయం తెలిసిందే. కేటీఆర్​ మంగళవారం ఉదయం చర్చ కోసం సోమాజిగూడ ప్రెస్​క్లబ్(Somajiguda Press Club)​కు చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా ప్రెస్​క్లబ్​ వద్దకు వచ్చారు. దీంతో పోలీసులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా మోహరించారు.

    మరోవైపు బీఆర్ఎస్​ నాయకులు దమ్ముంటే అసెంబ్లీ చర్చకు రావాలని సవాల్​ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్‌ నేతలు పారిపోతున్నారని విమర్శించారు.

    READ ALSO  Village Secretaries | నిధులు లేక.. విధులు భారం..

    కేటీఆర్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18 నెలలుగా అరాచక పాలన నడుస్తోందని విరుచుపడ్డారు. కాంగ్రెస్​ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక 600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వారికి నివాళి అర్పించారు. కాంగ్రెస్​ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

    KTR | బేసిక్​ నాలెడ్జ్ లేని సీఎం

    సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)కి బేసిక్​ నాలెడ్జ్ లేదని కేటీఆర్​ ఎద్దేవా చేశారు. అయినా చర్చకు రావాలని మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో తమకు సవాల్​ విసరడంతో వచ్చామని కేటీఆర్​ పేర్కొన్నారు. 72 గంటల సమయం ఇచ్చి.. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో చర్చకు రావాలని సవాల్​ చేస్తే రేవంత్​రెడ్డి ఢిల్లీ వెళ్లారన్నారు. ఆయన స్థానంలో మంత్రులను కూడా పంపలేదని విమర్శించారు. రేవంత్​రెడ్డికి రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదని ఈ రోజు తేలిపోయిందన్నారు.

    READ ALSO  Nizamabad City | గంజాయి విక్రయిస్తున్న బాలుడి అరెస్ట్

    KTR | తెలంగాణ రైతులకు సున్నం

    సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ రైతులకు(Telangana Farmers) సున్నం పెడుతూ.. కృష్ణ, గోదావరి జలాలను ఏపీకి తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు(Chandrababu Covert) పాలన నడుస్తోందని కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులను ఢిల్లీకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఆయన తొత్తులు కొత్త మందికి నియామకాలు ఇచ్చి రేవంత్​రెడ్డి మురిసి పోతున్నారన్నారు. రేవంత్​రెడ్డి ఢిల్లీకి బస్తాలు మోసి సీఎం పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు.

    KTR | ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ

    ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే సంక్షేమ పాలన అని ప్రజలు అనుకున్నారని కేటీఆర్​ పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్బంధాలు, అణచివేతలు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. నాడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలపించేలా తెలంగాణలో పాలన సాగుతోందన్నారు. సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టినా.. అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డికి కర్రు కాల్చి వాత పెడతారన్నారు.

    READ ALSO  CM Revanth Reddy | బాలలపై లైంగిక దాడుల విషయంలో కఠిన చర్యలు : సీఎం రేవంత్​ వార్నింగ్​

    Latest articles

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద...

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    Karnataka | క‌ర్ణాట‌కలో మ‌ళ్లీ మొద‌టికొచ్చిన వివాదం.. నాయ‌క‌త్వాన్ని మార్చాల‌న్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ అంశం దుమారం రేపుతూనే ఉంది. ఐదేళ్లూ ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని...

    More like this

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద...

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...