అక్షరటుడే, వెబ్డెస్క్: Warangal Railway Station | దేశంలో రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం (central governament) ఆధునిక హంగులతో డెవలప్ చేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లు (508 railway stations) ఎంపిక కాగా వరంగల్ రైల్వేస్టేషన్ (warangal railway station) సైతం ఎంపికైంది. రూ.25.41 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో తలపెట్టిన ఈ పునరుద్ధరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ మేరకు తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పన, సౌకర్యాలను మెరుగుపరచడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం (PM narendra modi governament) కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (central minister kishan reddy) ట్వీట్ చేశారు.
Warangal Railway Station | తెలంగాణలో 21 స్టేషన్లు
అమృత్ భారత్ స్టేషన్ పథకం (amrut bharat station scheme) కింద తెలంగాణవ్యాప్తంగా 21 స్టేషన్లు ఎంపికయ్యాయి. వీటి అభివృద్ధి కోసం రూ.894.09 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, హైదరాబాద్ (hyderabad), నిజామాబాద్ (nizamabad), కామారెడ్డి (kamareddy), హైటెక్సిటీ, హుప్పుగూడ, హఫీజ్పేట, జనగామ, కరీంనగర్, కాజీపేట జంక్షన్, మధిర, ఖమ్మం, మహబూబ్నగర్, మహబూబాబాద్, మల్కాజ్గిరి, మలక్పేట, రామగుండం, తాండూరు, యాదాద్రి, జహీరాబాద్ ఉన్నాయి.