అక్షరటుడే, ఇందూరు: MP Arvind | నిజామాబాద్ జిల్లాలో త్వరలో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Union Home Minister Amit Shah) సభను విజయవంతం చేయాలని ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ శనివారం జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
జాతీయ పసుపు బోర్డు కార్యాలయ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారని చెప్పారు. అనంతరం నిర్వహించే సభను విజయవంతం చేసేలా చూడాలని సూచించారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి (Palle Gangareddy, Chairman of the National Turmeric Board), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.