అక్షరటుడే, వెబ్డెస్క్:Punjab | పంజాబ్లో మరోసారి ఖలిస్థాన్(Khalistan) అనుకూల నినాదాలు చేయడం కలకలం రేపింది. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్(Amritsar Golden Temple)లో ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.
సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్థాన్ ఏర్పాటు చేయాలని గతంలో బింద్రన్వాలా (Bindranwala) తన అనుచరులతో గోల్డెన్ టెంపుల్ను ఆక్రమించాడు. దీంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ (Operation Blue Star) చేపట్టింది. 1984 జూన్ 1 నుంచి జూన్ 10 వరకు ఈ ఆపరేషన్ సాగింది. స్వర్ణ దేవాలయంలోని వేర్పాటువాదులను బయటకు పంపడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా జూన్ 6న వేర్పాటువాద నాయకుడు బింద్రాన్వాలా మరణించాడు.
Punjab | 41 ఏళ్ల తర్వాత..
ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టి 41 ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వర్ణ దేవాలయంలో శుక్రవారం ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేయడం గమనార్హం. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ భారత సైన్యం (Indian Army) చేపట్టిన అతి పెద్ద సైనిక చర్య. ఇదే రోజున బింద్రన్వాలే వర్ధంతి కూడా కావడంతో గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.