అక్షరటుడే, వెబ్డెస్క్:Reliance Jio | దేశీయ బ్రాడ్బ్యాండ్ మార్కెట్(Domestic brad band market)లో రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్కెట్లో సగానికిపైగా వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ట్రాయ్(TRAI) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం జియో 50.53 శాతం వాటాతో దేశంలో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(Vodafone Idea), బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఏప్రిల్ 30 నాటికి దేశంలో బ్రాడ్బ్యాండ్ మార్కెట్ వివరాలను ఇటీవల విడుదల చేసింది. దేశంలో మొత్తం 944.12 మిలియన్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్లున్నారు. ఇందులో రిలయన్స్ జియో(Reliance Jio) 50.53 శాతం వాటా కలిగి ఉంది. వేగవంతమైన 5G రోల్అవుట్, ఫైబర్ టు ది హోమ్ సేవల విస్తరణతో దేశంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. సరసమైన ధరలకు వివిధ రకాల ప్లాన్లను అందుబాటులో ఉంచడం కూడా జియో ఆదరణకు ఒక కారణంగా భావిస్తున్నారు.
Reliance Jio | రెండో స్థానంలో ఎయిర్టెల్..
బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో భారతి ఎయిర్టెల్(Airtel) రెండో స్థానంలో ఉంది. దేశీయ బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లో 30.68 శాతం వాటా ఈ సంస్థదే.. 13.32 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా, 3.63 శాతం వాటాతో బీఎస్ఎన్ఎల్(BSNL) నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇతర చిన్నచిన్న సర్వీస్ ప్రొవైడర్లు(Service providers) నామమాత్రపు వాటాను కలిగి ఉన్నారు.