అక్షరటుడే, వెబ్డెస్క్: Amarnath Yatra | అత్యంత ప్రతిష్టాత్మక, ఆధ్యాత్మిక యాత్రగా భావించే అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాత్ర సజావుగా సాగడానికి జమ్మూ ప్రభుత్వం (Jammu government) భారీ భద్రతను ఏర్పాటు చేసింది. బహుళ అంచెల్లో భద్రతా చర్యలు చేపట్టినట్లు కశ్మీర్ పోలీసు చీఫ్ వీకే బిర్డి (Kashmir Police Chief VK Birdi) బుధవారం తెలిపారు. “ఈ సంవత్సరం శ్రీ అమర్నాథ్ యాత్ర వచ్చే వారం ప్రారంభమవుతుంది. జమ్మూ-కశ్మీర్ పోలీసులు (Jammu and Kashmir Police). ఇతర భద్రతా దళాలు యాత్ర కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి యాత్రను సురక్షితంగా, సజావుగా చేయడానికి బహుళ అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేశామని” అని కశ్మీర్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు.
Amarnath Yatra | భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
పహల్గామ్ మీదుగా సాగే అమర్ నాథ్ యాత్రకు భద్రతా ఏర్పాట్లపై వీకే బిర్డి బుధవారం సమీక్షించారు. నున్వాన్ బేస్ క్యాంప్(Nunwan base camp)ను సందర్శించిన ఆయన.. జూలై 3 నుంచి ప్రారంభమయ్యే తీర్థయాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. 38 రోజుల పాటు సాగే తీర్థయాత్రకు భద్రతా ఏర్పాట్లను జోనల్తో సహా వివిధ స్థాయిలుగా విభజించామని, యాత్రకు ముందు బుధవారం భద్రతా కసరత్తులు జరిగాయని ఐజీ చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి సమయంలో అప్రమత్తతను, సంసిద్ధతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కసరత్తులు జరిగాయని వివరించారు. యాత్రకు స్థానికుల మద్దతు గురించి విలేకరులు ప్రశ్నించగా.. స్థానిక జనాభా మద్దతు లేకుండా యాత్ర నిర్వహణ సాధ్యం కాదన్నారు. భద్రతా దళాలు దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam), అనంత్నాగ్, ఖాజిగుండ్, శ్రీనగర్లోని పంథా చౌక్, ఉత్తర కశ్మీర్లోని బండిపోరా జిల్లాలోని సుంబల్లలో కసరత్తులు నిర్వహించాయి.