అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్కు చెందిన భూముల రక్షణ కోసం మంగళవారం మండల కేంద్రంలో ధర్నా తలపెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ (Congress Party Mandal President Ele Mallikarjun) తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉదయం 10:30కు మండల కేంద్రంలో ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది పార్టీ పరంగా కాకుండా ప్రజల హక్కుల కోసం చేసే ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.