అక్షరటుడే, వెబ్డెస్క్: Cyber Fraud | సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో లింక్లు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) కీలక హెచ్చరికలు జారీ చేశారు. రైతులే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైంది. దీంతో పెట్టుబడి కోసం రైతులు(Farmers) వివిధ మార్గాల ద్వారా డబ్బు సేకరిస్తుంటారు. అయితే సైబర్ నేరగాళ్లు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(PM Kisan Samman Nidhi), ముద్ర లోన్స్(Mudra Loans), సూర్య ఘర్(Suryagarh) పేరిట లింక్లు పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేయగానే ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా నిధుల విడుదలకు కూడా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో రైతు భరోసా(Rythu Bharosa) పేరిట కూడా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర లింక్లు ఓపెన్ చేయొద్దని, ఎవరికీ బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పొద్దని పలు సూచనలు చేశారు.