More
    Homeభక్తిTTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. దర్శన వేళల్లో మార్పు

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. దర్శన వేళల్లో మార్పు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | వేసవి సెలవుల summer holidays నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో టీటీడీ ttd భక్తుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వీఐపీ దర్శన vip darshan ttd వేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి.

    TTD | బ్రేక్​ దర్శనం సమయం తగ్గింపు

    తిరుమల tirumalaలో గతంలో గురు, శుక్రవారాల్లో ఉదయం 7.30 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు vip brake darshsan ఉండేవి. మిగతా రోజుల్లో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు దర్శనాలు కొనసాగేవి. దీంతో క్యూలైన్​లో ఉన్న సామాన్య భక్తులు, రూ.300 special darshan టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులు ఇబ్బంది పడేవారు. తాజాగా టీటీడీ  వీఐపీ దర్శన వేళలను మార్చింది. ఉదయం 6.20 నుంచి 8.30 వరకు వీఐపీ ప్రోటోకాల్, రిఫరల్, జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నవారికి దర్శనం కల్పించనున్నారు. అనంతరం సామాన్య భక్తులను అనుమతిస్తారు. ఉదయం 10.20 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీవాణి దర్శనం టికెట్లు, దాతలు, టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు దర్శనం కల్పించనున్నారు. గతంతో పోలీస్తే వీఐపీ బ్రేక్​ దర్శనం సమయాన్ని తగ్గించారు.

    READ ALSO  Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. లడ్డూ ప్రసాదం కోసం వేచి ఉండాల్సిన పని లేదు

    TTD | ప్రయోగాత్మకంగా అమలు..

    సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయాలను టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ మార్పులపై మరో రెండు, మూడు రోజులు పరిశీలించి తర్వాత అవసరం ఉంటే మార్పులు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది. మరోవైపు వేసవిలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ సిఫార్సు లేఖలపై దర్శనాలను కూడా నిలిపివేసింది.

    Latest articles

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    More like this

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...