అక్షరటుడే, వెబ్డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఎయిర్ ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270కి పైగా మంది మరణించారు. కాగా.. మృతుల గౌరవార్థం ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానం నంబర్ AI-171 నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. AI-171 స్థానంలో AI-159 నంబర్ విమానం అహ్మదాబాద్-లండన్ మధ్య సేవలందిస్తోందని ప్రకటించింది.
విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎయిర్ ఇండియా రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే క్షతగాత్రుల వైద్య ఖర్చుల కోసం నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అంతేగాకుండా డీజీసీఏ(DGCA) ఆదేశాల మేరకు బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదిక అందిస్తామని పేర్కొంది. తాజాగా ఎయిర్ ఇండియా మృతుల గౌరవార్థం కూలిపోయిన ఫ్లైట్ నంబర్ను వినియోగించకూడదని నిర్ణయించింది.