అక్షరటుడే, వెబ్డెస్క్: Plane crash | దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు (Ahmedabad Airport) నుంచి 242 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు (London) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 బోయింగ్ విమానం 1.17 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే సాంకేతిక సమస్య కారణంగా జనావాసాలపై కుప్పకూలింది. అనంతరం ఫైట్ నుంచి దట్టమైన మంటలు వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. అప్పటికే విమాన ప్రమాదం గుర్తించిన ఏవియేషన్ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్యూ ఆపరేషన్ చేపట్టారు. పదుల కొద్దీ ఫైర్ ఇంజన్లను మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Plane crash | స్పందించిన అమిత్ షా
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్షా (Union Home Minister Amit Shah) హుటాహుటిన గుజరాత్ సీఎంతో (Gujarat CM) పాటు ఇతర అధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) హుటాహుటిన గుజరాత్కు బయలు దేరారు.
ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన ఊపిరితో ఉన్న పలువురిని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో (Social media) బయటకు వచ్చాయి. కాగా.. విమానం బయలుదేరిన సమయంలో 2 పైలట్లు, 10 క్యాబిన్ క్రూజ్ సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.