More
    HomeతెలంగాణACB Trap | ఏసీబీకి చిక్కిన ఏఈ

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ఏఈ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు (government offices) వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. పేద ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు ఎవరిని అధికారులు విడిచిపెట్టడం లేదు. ఎంత వస్తే అంత అన్నట్లు లంచాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు రెవెన్యూ, మున్సిపల్​ కార్యాలయాలు (revenue and municipal offices) అయితే అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కార్యాలయాలకు ఏదైనా పని కోసం వెళ్తే అధికారుల చేతులు తడపాల్సిందే. లేదంటే ఆ పనిని పక్కన పడేస్తారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కింది.

    జీహెచ్​ఎంసీ (GHMC) పరిధిలోని అంబర్​పేట (Amberpet) గోల్నాక, నెహ్రూ నగర్, వార్డ్ నంబర్ -2లో మనీషా ఏఈగా పనిచేస్తోంది. అంబర్​పేట పరిధిలో పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్​ బిల్లుల కోసం ఆమెను కలిశాడు. దీంతో మనీషా లంచం డిమాండ్​ చేసింది. సదరు కాంట్రాక్టర్​ ఇదివరకే రూ.ఐదు వేలు చెల్లించాడు. మళ్లీ రూ.15 వేల లంచం అడగటంతో ఏసీబీ అధికారులను (ACB Officials) ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాధితుడి నుంచి సోమవారం ఏఈ మనీషా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

    READ ALSO  Kaushik Reddy | నా మీద కేసులు పెడితే AK-47 గన్ అవుతా: కౌశిక్​ రెడ్డి

    ACB Trap | భయం లేకుండా..

    రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ దాడులు (ACB Attacks) పెరిగాయి. ప్రజల్లో కూడా అవగాహన రావడంతో లంచం పేరిట వేధించే అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. కార్యాలయాలకు వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారు. కొందరు అధికారులు అయితే.. లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. ఆపరేటర్​ నుంచి మొదలు పెడితే.. ఉన్నతాధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఓ ఆపరేటర్​ రేషన్​కార్డు దరఖాస్తుల (ration card applications) నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తహశీల్దార్​ కార్యాలయాల్లో (Tahsildar offices) అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ACB Trap | ఫిర్యాదు చేయండి..

    ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

    READ ALSO  Adilabad | రెండురోజుల పసిపాపపై తెగిపడ్డ ఫ్యాన్.. చిన్నారికి గాయాలు

    Latest articles

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    More like this

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...