అక్షరటుడే, ఇందూరు: PRTU Telangana | రాష్ట్ర ప్రభుత్వం టీచర్లను సర్దుబాటు చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన అశాస్త్రీయ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ (PRTU Telangana District President Kripal Singh) డిమాండ్ చేశారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. బడిబాట తర్వాత విద్యార్థుల నమోదు ఆధారంగా సర్దుబాటు చేయాలన్నారు.
ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. అలాంటి అవసరమైన టీచర్లను కూడా సర్దుబాటు పేరుతో తొలగిస్తే గుణాత్మక విద్య శూన్యమవుతుందన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకుంటున్న తరుణంలో, పిల్లల భవిష్యత్తును చీకట్లోకి నెట్టే ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలన్నారు. జూలై లేదా ఆగస్టులో సర్దుబాటు చేయాలన్నారు.