అక్షరటుడే, బోధన్: Bodhan Police | మైనర్లకు వాహనాలిస్తే కేసులు నమోదు చేస్తామని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ (Traffic CI Chander Rathod) అన్నారు. బుధవారం పట్టణంలో bodhan Town మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని 60 మంది బైక్లు సీజ్ చేశారు. మైనర్లు నడుపుతున్న 20 వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, పట్టణ సీఐ వెంకటనారాయణ పాల్గొన్నారు.