Site icon aksharatoday.in

Telangana Police | డ్రగ్స్​ నియంత్రణే లక్ష్యంగా చర్యలు

Telangana Police

Telangana Police | డ్రగ్స్​ నియంత్రణే లక్ష్యంగా చర్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్:Telangana Police | తెలంగాణలో ప్రస్తుతం డ్రగ్స్​ విక్రయాలు(Drug sales) జోరుగా సాగుతున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు గంజాయి దొరుకుతోంది. ఎంతో మంది యువత గంజాయి, డ్రగ్స్​కు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు(Telangana Police) డ్రగ్స్​కు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన వారోత్సవాలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్​(Hyderabad)లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రారంభోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌(DGP Jitender), TGANB డైరెక్టర్ సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివారం నుంచి ఈ నెల 26 వరకు యాంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌(Anti-drug awareness) వీక్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్​తో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

Telangana Police | డ్రగ్స్​ వినియోగం పెరగడానికి కారణాలు..

రాష్ట్రంలో డ్రగ్స్​ వినియోగం విపరీతంగా పెరిగింది. తినగతినగా వేము తియ్యనుండు అన్నట్లు.. మద్యానికి బానిసైన పలువురు యువకులకు కొన్ని రోజులకు ఆ మత్తు సరిపోవడం లేదు. దీంతో వారు గంజాయి, డ్రగ్స్​కు అలవాటు పడుతున్నారు. ఒక్కసారి డ్రగ్స్(Drugs)​ తీసుకున్న వారి దానికి బానిసలు మారుతున్నారు. మరోవైపు విచ్చలవిడిగా డ్రగ్స్​ దొరుకుతుండటం కూడా ఇందుకు కారణం అవుతోంది. గత పదేళ్లలో రాష్ట్రంలో డ్రగ్స్​, గంజాయి దందా విపరీతంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు డ్రగ్స్​ నిర్మూలనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు.

Exit mobile version