అక్షరటుడే, వెబ్డెస్క్:Telangana Police | తెలంగాణలో ప్రస్తుతం డ్రగ్స్ విక్రయాలు(Drug sales) జోరుగా సాగుతున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు గంజాయి దొరుకుతోంది. ఎంతో మంది యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు(Telangana Police) డ్రగ్స్కు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన వారోత్సవాలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్(Hyderabad)లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్(DGP Jitender), TGANB డైరెక్టర్ సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివారం నుంచి ఈ నెల 26 వరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్(Anti-drug awareness) వీక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్తో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
Telangana Police | డ్రగ్స్ వినియోగం పెరగడానికి కారణాలు..
రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. తినగతినగా వేము తియ్యనుండు అన్నట్లు.. మద్యానికి బానిసైన పలువురు యువకులకు కొన్ని రోజులకు ఆ మత్తు సరిపోవడం లేదు. దీంతో వారు గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. ఒక్కసారి డ్రగ్స్(Drugs) తీసుకున్న వారి దానికి బానిసలు మారుతున్నారు. మరోవైపు విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుండటం కూడా ఇందుకు కారణం అవుతోంది. గత పదేళ్లలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా విపరీతంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు.