అక్షరటుడే, ఇందూరు: Registration Department | నిబంధనల ప్రకారం స్లాట్ బుక్ చేసుకుని వచ్చే డాక్యుమెంట్లను ఆపవద్దని, అలాంటి వారు ఎవరైనా ఉంటే చర్యలు తప్పవని శాఖ ఇన్ఛార్జి డీఐజీ వెంకట రమణ (DIG Venkata Ramana) పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (Registrations Department) నిజామాబాద్ డీఐజీగా (Nizamabad DIG) ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజువారి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలన్నారు. దరఖాస్తు దారులకు ఇబ్బందులు కలగకూడదన్నారు. స్లాట్ టైం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నారు. కాగా.. ఇటీవల రిజిస్ట్రేషన్లను ఓ అధికారి నిలిపివేయడంపై ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో డీఐజీ స్పందించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్లాట్లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు.
Registration Department | రెండు నెలల సెలవులో డీఐజీ
స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీగా రమేశ్ రెడ్డి (Ramesh Reddy) రెండు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ (Registration Department) ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ డి.వెంకట రమణకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రమేశ్ రెడ్డి తిరిగి విధుల్లో చేరే వరకు ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు.