అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్ రికార్డు స్థాయిలో అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు.
ఏసీబీ ఏప్రిల్లో మొత్తం 21 కేసులు నమోదు చేసింది. ఇందులో 12 ట్రాప్ కేసులు trap case, రెండు ఆదాయానికి మించిన assets cases ఆస్తుల కేసులు ఉన్నాయి. రెండు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, రెండు సాధారణ విచారణ, 2 తనిఖీల కేసులు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. మొత్తం 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు govt employees ఏసీబీకి చిక్కారు. ఆయా కేసుల్లో మొత్తం రూ.5.02 లక్షల నగదును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో రూ.3.51 కోట్ల ఆస్తులను గుర్తించారు. మరో కేసులో రూ.13.50 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు.
ACB | పెరిగిన అవగాహన
ప్రజల్లో ఏసీబీపై ACB telangana అవగాహన పెరిగింది. గతంలో ప్రభుత్వ అధికారులను ఎదురించడానికి ప్రజలు భయపడేవారు. అడిగినంత లంచం ఇచ్చి మరి పని చేయించుకునే వారు. అయితే ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో లంచం అడిగిన అధికారులను ఏసీబీకి పట్టిస్తున్నారు. ఏప్రిల్లో దాదాపు పది మంది పోలీసులు ఏసీబీకి చిక్కారు.
ACB | భయం వద్దు.. ఫిర్యాదు చేయండి
లంచం ఇవ్వొద్దని ప్రజలకు ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు లంచం అడిగితే తమను సంప్రదించాలని కోరుతున్నారు. లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ acb toll free number 1064 లేదా, acb contact number 9440446106కు వాట్సాప్లో సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని, భయపడకుండా తమకు ఫోన్ చేయాలని కోరుతున్నారు.