ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    ACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | ఏసీబీ అధికారులు(ACB Officers) అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు. అంతేగాకుండా అక్రమాలు జరుగుతున్న పలు శాఖలపై ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. తాజాగా బుధవారం ఉదయం కామారెడ్డి(Kamareddy) జిల్లా రాజంపేట మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్ పోస్టు(Pondurthi RTA Check Post)పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

    చెక్ పోస్టులో లారీల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. చెక్​ పోస్టు సిబ్బంది నియమించుకున్న ఏజెంట్లు లారీ డ్రైవర్ల (Lorry Drivers) నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకుంటున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను అధికారులు లెక్కిస్తున్నారు. ప్రైవేట్​ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    READ ALSO  Vemulawada | రోడ్డు విస్తరణ కోసం కూల్చివేతలు.. వేములవాడలో ఉద్రిక్తత

    ACB Raid | ఇష్టారీతిన వసూళ్ల దందా

    రాష్ట్రంలోని ఆర్టీఏ చెక్​పోస్టులలో ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు. లారీలు, ట్రక్కుల డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు గతంలో సైతం ఫిర్యాదులు అందాయి. దీంతో జూన్ 26న రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్​పోస్టులు, ఆర్టీఏ కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో రూ.1,81,030 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    ACB Raid | అంతర్రాష్ట్ర చెక్​పోస్టులో..

    కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం(Madnur Mandal) సలబత్​పూర్​ వద్ద మహారాష్ట్ర సరిహద్దులోని ఆర్టీఏ చెక్​పోస్టులో గత నెల 26న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో విధుల్లో ఏఎంవీఐ కవితతో పాటు సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్​ వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రిపూట చెక్​పోస్ట్​ సిబ్బంది తనిఖీల పేరిట వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెక్​పోస్టులో లెక్కకు మించి ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. 20 రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఆర్టీఏ చెక్​పోస్టుల్లో తనిఖీలు చేయడం గమనార్హం. ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  TPCC | టీపీసీసీ జనరల్ సెక్రెటరీకి బెయిల్ మంజూరు.. ఘనస్వాగతం పలికిన అనుచరులు

    Latest articles

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...

    Jal Shakti meeting | కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం.. జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jal Shakti meeting | జల వివాదాలపై కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు....

    Governor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Varma | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా...

    KTR | దమ్ముంటే మేడిగడ్డపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అసత్యాలు, అబద్ధాలు...

    More like this

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...

    Jal Shakti meeting | కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం.. జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jal Shakti meeting | జల వివాదాలపై కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు....

    Governor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Varma | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా...