అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | లంచం bribe తీసుకుంటు ఇద్దరు అధికారులు ఏసీబీ acbకి చిక్కారు. ములుగు mulugu జిల్లాలో పనిచేసే ఓ ఉద్యోగి తన వైద్య సెలవులకు సంబంధించిన జీతం బిల్లులు మంజూరు చేయాలని జడ్పీ కార్యాలయంలో zp office సంప్రదించాడు. బిల్లులు తయారు చేసి, ట్రెజరీకి పంపడానికి కార్యాలయంలో పని చేసే సూపరింటెండెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ ఎస్ సౌమ్య లంచం bribe డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ acb అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు మంగళవారం బాధితుడి నుంచి సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
