అక్షరటుడే, వెబ్డెస్క్: PAN Card | పాన్ కార్డు (PAN Card) దరఖాస్తుల విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి కొత్త పర్మనెంట్ అకౌంట్ నంబర్ (New PAN Card) కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ (Aadhaar) ప్రామాణీకరణ తప్పనిసరి అవుతుందని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. అదో అప్షన్గా మాత్రమే ఉంది. అయితే జూలై 1నుంచి ఆధార్ తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆధార్కార్డు లేకుంటే పాన్ కార్డు రాదు. పన్ను ఎగవేతను ఎదుర్కోవడానికి, నకిలీ మోసపూరిత పాన్ కార్డులను తొలగించడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
PAN Card | పన్ను ఎగవేతలు నిరోధించడానికి..
దేశంలో ప్రస్తుతం ఎంతోమంది పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పన్ను ఎగవేతలను నిరోధించడానికి పాన్, ఆధార్ లింక్ను కేంద్రం తప్పనిసరి చేసింది. అలాగే ఆధార్ లింక్తో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందడం అసాధ్యం. కొత్త విధానంతో పాన్ కార్డు జారీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.
PAN Card | కొత్తగా అమలులోకి వచ్చే మార్పులు
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో పలు మార్పులు రానున్నాయి. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ దరఖాస్తులకు రెండింటికి ఆధార్ తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఓటీపీ (OTP) వస్తుంది. లేదంటే బయోమెట్రిక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అథంటికేషన్ పూర్తయితే దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగి పాన్ కార్డు వస్తుంది.