అక్షరటుడే, వెబ్డెస్క్ : Online Betting | ఆన్లైన్ బెట్టింగ్లో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ యువకుడు రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతేగాకుండా రూ.60 లక్షలు నష్టపోయిన తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు.
హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల విద్యార్థి ఇటలీలో చదువుతున్న సమయంలో ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. తాను చెప్పినట్లు బెట్టింగ్ పెడితే భారీగా డబ్బులు వస్తాయని ఓ వ్యక్తి చెప్పడంతో యువకుడు నమ్మాడు. మొదట రెండు మూడు సార్లు లాభాలు రావడంతో బెట్టింగ్కు అలవాటు అయ్యాడు. ఈ క్రమంలో రూ.50 లక్షల వరకు ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్ (Bhopal)కు చెందిన అతని స్నేహితుడు ఇలాగే రూ.60 లక్షలు నష్టపోయాడు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడు తెలిపాడు.
ఈ మేరకు హైదరాబాద్కు చెందిన యువకుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా పనిచేసే ఈ రాకెట్ను నిర్వహించడంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లు, ఆరుగురు వ్యక్తులపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) కేసు నమోదు చేశారు.