ePaper
More
    HomeతెలంగాణRailway Line Doubling | తీరనున్న కల.. డబ్లింగ్ పనులకు భూ సేకరణ పూర్తి

    Railway Line Doubling | తీరనున్న కల.. డబ్లింగ్ పనులకు భూ సేకరణ పూర్తి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line Doubling | ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి నిజామాబాద్​ మీదుగా హైదరాబాద్​ నడిచే రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ మార్గంలో డబ్లింగ్​(Doubling) పనులు చేపట్టాలని గతంలో రైల్వేశాఖ(Railway Department) నిర్ణయించింది. తాజాగా ఇందుకు సంబంధించి నిజామాబాద్​ జిల్లా(Nizamabad District) పరిధిలో భూ సేకరణ ప్రక్రియ పూర్తయింది.

    Railway Line Doubling | ముథ్కేడ్​ నుంచి డోన్​ వరకు..

    మహారాష్ట్రలోని ముథ్కేడ్​ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్ జిల్లా డోన్​ రైల్వే స్టేషన్​ వరకు రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులకు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రద్దీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మరో లైన్​ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 417.88 కి.మీ.ల పొడవున్న ముథ్కేడ్-డోన్​ రైల్వే లైన్ డబ్లింగ్(Mudkhed-Dhon Railway Line Doubling) ప్రాజెక్టుకు రూ.4,686.09 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. డబ్లింగ్​తో బల్హర్షా-కాజీపేట-సికింద్రాబాద్, కాజీపేట-విజయవాడ మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.

    READ ALSO  Shadnagar | కిరాణా దుకాణం ముసుగులో గంజాయి చాక్లెట్ల అమ్మకం

    Railway Line Doubling | భూసేకరణ పూర్తి

    డబ్లింగ్​ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రైల్వే శాఖ ప్రారంభించింది. ఇందులో భాగంగా నిజామాబాద్​ జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తయినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry) పేర్కొంది. భూ సేకరణ వివరాలను రెవెన్యూ అధికారుల వద్ద ఉంచారు. భూసేకరణపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని ఇందల్వాయి, నడిపల్లి, బర్దీపూర్ గ్రామాల్లో 42 మందికి సంబంధించిన భూమిని సేకరించారు.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...