అక్షరటుడే, వెబ్డెస్క్: honeymoon couple missing : హనీమూన్కు వెళ్లిన జంట అదృశ్యమైన (Couple Missing) ఘటన మేఘాలయ(Meghalaya)లో జరిగింది.
వారం రోజులు గడిచినా ఇంకా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. పోలీసులు, వివిధ శాఖల అధికారులతో పాటు స్థానికులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా (Chief Minister Conrad Sangma) తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇందౌర్(Indore)లో ట్రాన్స్ పోర్టు వ్యాపారం చేసే రాజా రఘవంశీ – సోనమ్ నవ దంపతులు. హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. చివరిసారిగా సోహ్రా (చిరపుంజి)Sohra (Cherrapunji)లో పర్యటించారు. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. బైకు అద్దెకు తీసుకొని కొండప్రాంతం వైపు వెళ్లిన వీరు, ఓ ప్రాంతంలో వాహనం వదిలేసి కాలినడకన వెళ్లినట్టు భావిస్తున్నారు. వీరి కోసం మేఘాలయ సర్కారు ముమ్మరంగా గాలింపు చేపట్టింది. దంపతుల కుటుంబ సభ్యులు సైతం వారి ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది.
“మధ్యప్రదేశ్కు చెందిన నవ దంపతులకు సంబంధించి దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. వారు అదృశ్యమైనట్లు నివేదికలు వచ్చాయి. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (Madhya Pradesh CM Mohan Yadav) నాతో మాట్లాడారు. అక్కడి హోంశాఖ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటనపై నిత్యం వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా. ఆ జంట ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు, స్థానిక ప్రజలు ముమ్మురంగా గాలిస్తున్నారు” అని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఓ వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు.
వర్షాలు పడుతుండటంతో గాలింపు చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. చిరపుంజిలో భారీ వర్షాలు పడుతుండటంతో సెర్చ్ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.