అక్షరటుడే, వెబ్డెస్క్: Elevated corridor | హైదరాబాద్ (Hyderabad) నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. వాహనాల రద్దీ పెరగడంతో నగరవాసులు ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం ప్రభుత్వం నగరంలో ట్రాఫిక్ సమస్య (Traffic Problem) పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం పీజేఆర్ ఫ్లై ఓవర్ (PJR Flyover)ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పరిధిలో ట్రాఫిక్ తిప్పలు తప్పించడానికి ప్రభుత్వం తాజాగా కీలక ఒప్పందం చేసుకుంది.
Elevated corridor | రక్షణ శాఖతో ఒప్పందం
సికింద్రాబాద్ (Secunderabad) నగరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ శాతం రోడ్లు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉంటాయి. దీంతో వాటి విస్తరణకు ఆటంకాలు ఉండడంతో ట్రాఫిక్ సమస్య అలాగే ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం సికింద్రాబాద్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. రక్షణ శాఖ పరిధిలో ఉంటే కంటోన్మెంట్ (Cantonment) భూముల మీదుగా ఈ కారిడార్ నిర్మించనున్నారు. ఈ క్రమంలో తాజాగా కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
Elevated corridor | రెండు కారిడార్లు..
ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనదారులు ప్రస్తుతం సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ సమస్యతో తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో ఆయా జిల్లాలకు కనెక్టివిటీ పెంచేలా రెండు కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యారడైజ్ సర్కిల్ నుంచి శామీర్పేట (SH-01) వరకు 18.14 కిలోమీటర్లు, ప్యారడైజ్ సర్కిల్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు కారిడార్ (NH-44) వరకు 5.32 కిలో మీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు.
Elevated corridor | గతంలోనే అనుమతి
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి గతంలోనే రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా భూముల బదలాయింపునకు సంబంధించి ఒప్పందం(MoU) కుదిరింది. కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ దాదాపు 65 ఎకరాల భూమిని హెచ్ఎండీఏకు ఇవ్వనుంది. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు 435 ఎకరాల భూమిని ఇవ్వనుంది.
Elevated corridor | కారిడార్ నిర్మాణం ఈ మార్గంలో..
సికింద్రాబాద్లోని జింఖానా మైదానం నుంచి హకీంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్, శామీర్పేట మీదుగా ఔటర్ రింగ్రోడ్డు వరకు కారిడార్ నిర్మిస్తారు. ప్యారడైజ్ సర్కిల్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎయిర్పోర్టు ఆనుకొని ఉన్న ప్రాంతంతో సొరంగ మార్గంలో కారిడార్ నిర్మిస్తారు. దీనికి మొత్తం రూ.3,812 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ కారిడార్ల కోసం పలు ప్రైవేట్ ఆస్తులను కూడా అధికారులు సేకరించనున్నారు. పలు భవనాలు కూల్చి వేయడానికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం రక్షణ శాఖతో ఒప్పందం కుదరడంతో త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది.