అక్షరటుడే, ఇందూరు:Employees JAC | రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ సుమన్(Nizamabad JAC Chairman Suman), జిల్లా కన్వీనర్ అలుక కిషన్(District Convener Aluka Kishan) కోరారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy)కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలను సీఎం(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో ఛైర్మన్లు రమేష్, రమణ రెడ్డి, శ్రీనివాస్, రాము, వైస్ ఛైర్మన్ శేఖర్, కృపాల్ సింగ్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.