అక్షరటుడే, వెబ్డెస్క్: Ceasefire Violation | భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి గంటలు గడవకముందే.. పాక్ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సాయంత్రం 5 గంటలు ఒప్పందం అమలులోకి రాగా.. చీకటి పడగానే మళ్లీ డ్రోన్లతో తెగబడినట్లు pak drone strike at srinagar తెలుస్తోంది.
అప్రమత్తమైన భారత్ దాడులను తిప్పి కొడుతోంది. పలు చోట్ల బ్లాక్అవుట్ ప్రకటించింది. డ్రోన్లను గగనతనంలో పేల్చివేసింది. పాక్ దాడులతో శ్రీనగర్లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఒక్కసారిగా తెరుచుకున్నాయి.
కాగా.. పాక్ దాడులపై సీఓం ఒమర్ అబ్దుల్లా cm omar abdullah స్పందించారు.. శ్రీనగర్లో వరుసగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మళ్లీ ఏం జరుగుతోంది..? ఇది కాల్పుల విరమణ కాదు.. అంటూ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు.
భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ ఉగ్ర మూక కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత్ ఆర్మీ దాడులను తిప్పి కొడుతోంది. ఉధంపూర్లో బ్లాక్అవుట్ black outs in india మధ్య పాకిస్తాన్ డ్రోన్లను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డగించాయి. ఫలితంగా గగనతనంలో పేలుళ్ల శబ్దాలు మిన్నంటాయి. మరోవైపు సరిహద్దులో సైరన్ల మోత కొనసాగుతోంది.