More
    HomeజాతీయంOperation Sindoor | భారత్​ దాడులతో పాక్​కు తీవ్ర నష్టం

    Operation Sindoor | భారత్​ దాడులతో పాక్​కు తీవ్ర నష్టం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ తర్వాత ఎల్​వోసీ దగ్గర పాకిస్తాన్​ తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. భారత్​, పాక్​ కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత సీడీఎంఈ రఘునాయర్​, కల్నల్​ సోఫియా ఖురేషి, వింగ్​ కమాండర్​ వ్యోమికా సింగ్​ శనివారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు. భారత్​ దాడుల్లో పాక్​కు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. భారత్​ పాక్​ మిలటరీ బేస్​లను ధ్వంసం చేసిందని తెలిపారు.

    Operation Sindoor | మతకల్లోలకు పాక్​ కుట్ర

    ఆపరేషన్​ సిందూర్​తో పాక్​ పౌరులకు ఇబ్బందులు కలగకుండా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్​ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. పాక్​లోని ప్రార్థన మందిరాలను, పౌరులను లక్ష్యంగా చేసుకోని భారత్​ దాడులు చేయలేదని చెప్పారు. కానీ పాకిస్తాన్​ ఎల్​వోసి వెంబడి సామాన్య పౌరులపై దాడులు చేసిందన్నారు. ఆలయాలు, గురుద్వారాలపై దాడులు చేసి భారత్​లో మతకల్లోలాలు చేయాలని కుట్ర పన్నిందన్నారు.

    READ ALSO  Iran - Israel | భారత్​కు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్​.. ఎందుకో తెలుసా

    Operation Sindoor | అసత్య ప్రచారాలు..

    భారత్​ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్​.. సోషల్​ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసిందని అధికారులు తెలిపారు. ఎస్​ 400 రక్షణ వ్యవస్థను, ఇండియన్​ ఎయిర్​బేస్​లు, బ్రహ్మోస్​ క్షిపణులను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిందన్నారు. పాక్​ దాడుల్లో భారత్​ ఆర్మీ స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. పలువురు సామాన్య పౌరులు, జవాన్లు మృతి చెందినట్లు వివరించారు.

    Operation Sindoor | సైన్యం సన్నద్ధంగా ఉంది

    భారత సైన్యం పాక్​తో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సర్వం సన్నద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. పాక్​ దాడుల్లో భారత సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. దేశాన్ని కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధమే అని పేర్కొన్నారు. భారత్‌ దాడులతో పాక్‌ సైన్యం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. భారత సైన్యం పాక్ ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసిందన్నారు.

    READ ALSO  Aadhaar Updation | గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇక ఇంట్లో నుంచే ఆధార్ అప్​డేట్​

    Latest articles

    mlc kavitha | పోరాటాలతోనే బీసీ రిజర్వేషన్ల అమలు : ఎమ్మెల్సీ కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : mlc kavitha | కాంగ్రెస్ పార్టీకి కుల గణనపై చిత్తశుద్ధి లేదని, ఆ నివేదిక...

    Nizamsagar | 18న నిజాంసాగర్ నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈనెల 18న నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ...

    Airline passengers | హ‌డ‌లిపోతున్న విమాన ప్ర‌యాణికులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Airline passengers | అహ్మదాబాద్ విమాన దుర్ఘ‌ట‌న (Ahmedabad Plane Crash) అనంతరం పలు విమానాల్లో...

    ACB Raid | ఏసీబీకి చిక్కిన ఏఈ, సీనియర్​ అసిస్టెంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raid | మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ (ACB) వలకు చిక్కారు. ఎంతమంది...

    More like this

    mlc kavitha | పోరాటాలతోనే బీసీ రిజర్వేషన్ల అమలు : ఎమ్మెల్సీ కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : mlc kavitha | కాంగ్రెస్ పార్టీకి కుల గణనపై చిత్తశుద్ధి లేదని, ఆ నివేదిక...

    Nizamsagar | 18న నిజాంసాగర్ నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈనెల 18న నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ...

    Airline passengers | హ‌డ‌లిపోతున్న విమాన ప్ర‌యాణికులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Airline passengers | అహ్మదాబాద్ విమాన దుర్ఘ‌ట‌న (Ahmedabad Plane Crash) అనంతరం పలు విమానాల్లో...