అక్షరటుడే, వెబ్డెస్క్: Donald trump | పహల్గామ్ ఉగ్రదాడికి (pahalgam terrorist attack) ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను చేపట్టింది. ఇందులో భాగంగా పాక్లోని టెర్రరిస్ట్ క్యాంపులే (pakistan terrorist camps) లక్ష్యంగా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు రోజులుగా భారత్పై పాక్ దాడులు (pakistan attacks on india) చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. రిటాలియేషన్లో భాగంగా భారత్ సైతం (indian army) పాక్లోని పలుచోట్ల దాడులు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.
కాగా.. భారత్ – పాక్ మధ్య దాడులు (india – pakistan attacks) కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) సంచలన ప్రకటనల చేశారు. తక్షణ సీజ్ఫైర్కు రెండు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఇందుకోసం రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. భారత్ – పాక్ (india-pakistan) సమయస్ఫూర్తితో వ్యవహరించాయని చెప్పారు. రెండు దేశాలకు అభినందనలు తెలుపుతూ ‘ట్రూత్’, ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.