అక్షరటుడే, వెబ్డెస్క్: Ambati Rayudu | భారత ప్రజలకు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్షమాపణలు చెప్పాడు. భారత్-పాకిస్థాన్ (india-pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతను చేసిన ఓ ట్వీట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపరేషన్ సిందూర్కు (operation sindoor) ప్రతీకారంగా పాకిస్థాన్.. భారత సరిహద్దు నగరాలపై దాడులకు పాల్పడటంతో గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ను రద్దు (punjab kings and delhi capitals match suspend) చేశారు. దేశ సరిహద్దు నగరాల్లో బ్లాకౌట్ (country border citys announced blackout) పాటించడంతో ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పాకిస్థాన్ దాడులను (pakistan attacks) భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
ఈ ఉద్రిక్తతలను ఉద్దేశించిన అంబటి రాయుడు ఓ ట్వీట్ (ambati rayudu tweet) చేశాడు. ‘కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది’ అనే మహాత్మ గాంధీ కొటేషన్ను (mahthma gandhi quetetion) పంచుకున్నాడు. అయితే ఈ ట్వీట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వాన్ని (india governament), ఆపరేషన్ సిందూర్ను (operation sindoor) తప్పు పట్టేలా ఈ ట్వీట్ ఉందని మండిపడ్డారు. కొందరైతే జుగుప్సాకరమైన రీతిలో కామెంట్ చేశారు. వెంటనే తన తప్పిదాన్ని గుర్తించిన రాయుడు.. వరుస ట్వీట్స్తో డ్యామెజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా నెటిజన్లు శాంతించలేదు. దాంతో ఆ కొటేషన్ వెనుక ఉన్న ఉద్దేశంపై రాయుడు ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
‘భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో (india-pakistan borders) నెలకొన్న పరిస్థితిపై నేను చేసిన ఓ ట్వీట్పై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ట్వీట్ను అపార్థం చేసుకున్నారు. భారత బలగాలను తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. ఈ కఠినమైన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (prime minister narendra modi) నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు (operation sindoor) నేను పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ధైర్య సాహాసాలు కలిగిన మన భారత సైన్యానికి (indian army) నేనెప్పుడూ అండగా ఉంటాను. భారతీయుల మనోభావాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. జై హింద్. జై భారత్ (jai hind jai bharath). అని ట్వీట్ చేశాడు.