అక్షరటుడే, వెబ్డెస్క్: Chardham Yatra | భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల (india-pakistan tension) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం (central governament key decision) తీసుకుంది. ఛార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది (announcement of chardham yatra cancel).
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు (pakistan attacks with drones and missiles) చేస్తోంది. ముఖ్యంగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు (targeting to attack on tempels and tourist places) పాల్పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం చార్ధామ్ యాత్రను (chardham yatra) నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్ (badrinath), కేదార్నాథ్ (kedarnath), గంగోత్రి (gangothri), యమునోత్రిలో (yamunothri) భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ సేవలను (helicopter services) కూడా కేంద్రం నిలిపివేసింది.
చార్ధామ్ యాత్ర (chardham yatra) హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర ఆలయాలను ఇందులో భాగంగా సందర్శిస్తారు. ఈ ఏడాది మే 1న యాత్ర ప్రారంభమైంది. పటిష్ట బందోబస్తు మధ్య యాత్ర నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యాత్రను నిలిపివేయాలని (decided to suspend the yatra) కేంద్రం నిర్ణయించింది. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి పాక్ దాడులు (pakistan attacks) కొనసాగాయి. ఈ దాడులకు ప్రతీకారంగా భారత్ పాక్లోని పలు నగరాలపై దాడులు (india attack on pakistan citys) చేసినట్లు సమాచారం.