అక్షరటుడే, వెబ్డెస్క్: Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకు పవన్ తనకు వచ్చే వేతనాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో చిన్నారికి నెలకు రూ.5 వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ఇకపై ప్రతి నెలా అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే సాయం అందనుంది. తన వేతనంలో మిగతా మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని పవన్ ప్రకటించారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
ఇకపై ప్రతి నెలా అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే సాయం అందనుంది. తన వేతనంలో మిగతా మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని పవన్ ప్రకటించారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.