అక్షరటుడే, వెబ్డెస్క్ : Uttam kumar Reddy | పాక్తో యుద్ధం మొదలైతే తాను కూడా పాల్గొంటానని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి Uttam kumar Reddy ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ operation sindoor చేపట్టిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. ఒక్క పౌరుడు గాయపడకుండా మన సైన్యం దాడులు చేసిందన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పాక్ మన యుద్ధ విమానాలను కూల్చలేదని ఆయన పేర్కొన్నారు. దాయాది దేశం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.
Uttam kumar Reddy | పీవోకేను స్వాధీనం చేసుకోవాలి
భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఆ దేశం పతనం అవుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. అలా అయితే పాక్ విచ్ఛిన్నం అవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పీవోకే (POK)ను భారత్ స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని తెలిపారు. యుద్ధం మొదలైతే తాను కూడా పాల్గొంటానని ఆయన వ్యాఖ్యానించారు. తన అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తానని చెప్పారు. కాగా.. ఉత్తమ్కుమార్ రెడ్డి గతంలో వైమానిక దళంలో పైలట్గా పని చేశారు. మిగ్ 21 mig21, మిగ్ 23 mig23 విమానాలను ఆయన నడిపారు. ఈ నేపథ్యంలో యుద్ధంలో తాను కూడా పాల్గొంటానని మంత్రి తెలిపారు.