అక్షరటుడే, వెబ్డెస్క్ : IMF | పాకిస్తాన్ను (pakistan) భారత్ అష్ట దిగ్బంధనం చేస్తోంది. ఆపరేషన్ సిందూర్కు (operation sindoor) ప్రతీకారంగా ఆ దేశంలో భారత్పై దాడులకు తెగబడుతోంది. దీంతో భారత్ (india) పాక్ దాడులను (pakistan attacks) తిప్పి కొడుతోంది. పాక్ మిసైల్స్, డ్రోన్లు, యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్ (india shot down Pakistani missiles, drones and fighter jets) ఇప్పటికే త్రివిధ దళాలతో ఆ దేశాన్ని చుట్టుముట్టింది. ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో మోహరించి కరాచి పోర్ట్పై దాడి (INS vikarant deployed in Arabian Sea and attacked Karachi Port) చేసింది. పాక్లోని కీలక నగరాలపై భారత్ దాడులు (india attack on pakistan main citys) చేస్తోంది. మరోవైపు అంతర్జాతీయంగా సైతం ఆ దేశాన్ని భారత్ ఒంటరి చేస్తోంది. పాక్ దాడులు, ఉగ్రవాదులకు చేస్తున్న సాయానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి (united nations) భారత్ అందజేసింది.
తాజాగా పాక్కు అప్పు పుట్టకుండా భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. పాకిస్తాన్కు ఇచ్చే రుణాలను సమీక్షించాలని ఐఎంఎఫ్ (IMF)ను కోరింది. పాకిస్తాన్ 1.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీపై (pakistan 1.3 billion dollar package) నేడు ఐఎంఎఫ్ సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో రుణం (loan) ఇవ్వొద్దని భారత్ కోరింది. పాక్కు రుణం ఇస్తే ఉగ్రవాద కార్యకలాపాల (terrorist activities) కోసం వినియోగిస్తోందని భారత్ వాదిస్తోంది.