అక్షరటుడే, న్యూఢిల్లీ: Cyber criminals : భారత్ – పాకిస్తాన్ నడుమ ఓ వైపు భీకర పోరు కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల అమాయక ప్రజలే లక్ష్యంగా పాక్ డ్రోన్లతో దాడికి తెగబడుతోంది. భారత్ indian army వాటిని దీటుగా ఎదుర్కొని నేలమట్టం చేస్తోంది. దీంతో పాటు ప్రతిదాడులు కొనసాగిస్తోంది.
ఇదిలా ఉండగా.. సందట్లో సడేమియాలా సైబర్ నేరగాళ్లు cyber criminals fake messages విజృంభిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త మోసానికి తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ అమాయకులకు ఫోన్ చేస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ rtc MD VC Sajjanar స్పందించారు. ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేశారు. నకిలీ అధికారులను నమ్మొద్దని హెచ్చరించారు. డోనేషన్ల పేరుతో ఫోన్లు వస్తే స్పందించవద్దని సూచించారు.