More
    Homeజిల్లాలుకామారెడ్డిPaddy centers | తరుగు పేరిట దోపిడీ.. నష్టపోతున్న రైతులు

    Paddy centers | తరుగు పేరిట దోపిడీ.. నష్టపోతున్న రైతులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్/ఎల్లారెడ్డి : Paddy centers | ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలను (farmer) మిల్లర్లు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాలు (governament) మారినా.. అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా.. ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు. ప్రతీ సీజన్​లో మిల్లర్లు రైతులను మోసం (millers cheat farmers every season) చేస్తూనే ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదు.

    నిజాంసాగర్ మండలం మాగి, లింగంపేట మండలం అయ్యపల్లి, షెట్పల్లి, లింగంపేట, మెంగారం తదితర గ్రామాల్లో (nizamsagar mandal, magi village) స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం (paddy purchase center) నుంచి ఇప్పటివరకు 30కి పైగా లారీలు మిల్లులకు తరలించారు. నిర్వాహకులు తాలు లేకుండా మిషన్​ పట్టించాలనడంతో రైతులు (farmer) చెమటోడ్చి మిషన్​ పట్టారు. ఇలా శుద్ధి చేస్తే 40 కిలోల బస్తాకు అదనంగా 1.7 కేజీలు తూకం వేస్తే సరిపోతుందని నిర్వాహకులు చెప్పినప్పటికీ.. రైతులకు మాత్రం లాభం జరగట్లేదు.

    READ ALSO  MLC Kavitha | బస్ భవన్​ను​ ముట్టడించిన ఎమ్మెల్సీ కవిత.. అరెస్ట్​ చేసిన పోలీసులు

    Paddy centers | చేతులు ఎత్తేస్తున్న నిర్వాహకులు

    కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు (purchasing center managers) చెప్పినట్లు తూకం వేసినా మిల్లర్లు మళ్లీ కోత పెడుతున్నారు. లేదంటే లారీలో నుంచి ధాన్యం దించుకోవడం లేదు. క్వింటాకు అదనంగా మూడు కిలలో తరుగు తీస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు (farmers are suffering serious losses). జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తరుగు దోపిడీ కొనసాగుతోంది. దీనిపై నిర్వాహకులను ప్రశ్నిస్తే.. మిల్లుకు తమ ధాన్యం చేరిన తర్వాత అక్కడ ఓకే చేసే వరకు రైతులదే బాధ్యత అని చెబుతున్నారు.

    Paddy centers | రూ.20 వేలు నష్టపోయా..

    –‌‌ మాటూరు శ్రీనివాస్, రైతు, మాగీ

    మిషన్​ పట్టించి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించా. తూకం సమయంలో బస్తాకు 41.7 కిలోలు జోకారు. మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత మళ్లీ క్వింటాలుకు మూడు కిలోల చొప్పున కోత పెట్టారు. దీంతో మొత్తం రూ.20 వేల వరకు నష్టపోయా. అధికారులు స్పందించి తరుగు తీయకుండా చూడాలి.

    READ ALSO  Phone Tapping Case | ముగిసిన ప్రభాకర్​ రావు విచారణ

    Paddy centers | లారీకి 15 సంచులు కట్ చేశారు..

    – పిట్ల గంగారాం, రైతు అయ్య పల్లి, లింగంపేట

    లారీకి 15 సంచులు తరుగు పేరుతో మిల్లర్ కట్ చేశారు. ఐకేపీ సీసీతో మాట్లాడితే తొమ్మిది సంచులకు డీల్ చేశారు. లారీ డ్రైవర్ కు సంచికి రూపాయి, తాడు గుంజే వ్యక్తికి సంచికి మరో రూపాయి చొప్పున రైతులు చెల్లించి ధాన్యం తరలిస్తున్నారు. దోపిడి అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.

    Paddy centers | రూ.60 వేల వరకు నష్టం..

    – అంజయ్య, రైతు మాగి

    కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్తే 1,400 బస్తాలు అయ్యాయి. తరుగు పేరిట రైస్​ మిల్లర్లు క్వింటాలుకు 3 కిలోల చొప్పున కోత విధించారు. దీంతో సుమారు రూ.60 వేల వరకు నష్టపోతున్నాను. అసలే అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తుంటే రైస్​మిల్లర్లు దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు సంధించి చర్యలు తీసుకోవాలి

    READ ALSO  Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా పడేది అప్పుడే!

    Latest articles

    Kuppam | సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం

    అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం...

    Kerala | పూజల పేరుతో మహిళను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala : పూజల పేరుతో మహిళను లైంగికంగా లోబర్చుకున్న ఘటన కేరళలో జరిగింది. బెంగళూరు(Bengaluru)కు చెందిన...

    Seven Hills Express Train | తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Seven Hills Express Train : ప్రస్తుత రోజుల్లో ప్రయాణికుల ప్రాణాల‌కి గ్యారెంటీ అనేది లేకుండా...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌...

    More like this

    Kuppam | సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం

    అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం...

    Kerala | పూజల పేరుతో మహిళను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala : పూజల పేరుతో మహిళను లైంగికంగా లోబర్చుకున్న ఘటన కేరళలో జరిగింది. బెంగళూరు(Bengaluru)కు చెందిన...

    Seven Hills Express Train | తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Seven Hills Express Train : ప్రస్తుత రోజుల్లో ప్రయాణికుల ప్రాణాల‌కి గ్యారెంటీ అనేది లేకుండా...