అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL | ఐపీఎల్లో ipl మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ match fixing on ipl ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు ఫిక్సింగ్కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (Rajasthan cricket association) కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. జైపూర్లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో గెలుపు దిశగా సాగిన ఆర్ఆర్ చివరి ఓవర్లో బోల్తా పడింది.
చివరి ఓవర్లో గెలుపునకు 9 పరుగులు అవసరమైన దశలో క్రీజులో ఉన్న ధ్రువ్ జురేల్, హెట్మెయిర్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్ ఆరు పరుగులే ఇచ్చి లక్నోకు విజయం అందించాడు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగానే గెలిచే మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయిందని బిహానీ ఆరోపించారు. ఈ మ్యాచ్పై వెంటనే దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.
కాగా.. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై bcci సైతం టీమ్స్, యజమానులు, కోచ్ లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. తాజాగా మరోసారి ipl match fixing ఆరోపణలు రావడం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది.