More
    Homeజిల్లాలునిజామాబాద్​Leopard | చనిపోతున్న చిరుతలు.. జిల్లాలో వరుస ఘటనలు

    Leopard | చనిపోతున్న చిరుతలు.. జిల్లాలో వరుస ఘటనలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Leopard | అడవిలో ఉండాల్సిన చిరుతలు జనాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నాయి. ఇందల్వాయి అటవీ రేంజ్‌ పరిధిలో (Indalwai forest range) ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అటవీ అధికారులు తిరిగి వాటి సంరక్షణ చర్యలు చేపట్టారు.

    సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో (Sirnapalli forest area) 2018లో రైలు ఢీకొని ఓ చిరుత గాయపడింది. దానికి చికిత్స అందించేందుకు అధికారులు హైదరాబాద్‌ తరలించగా కొద్ది రోజులకు చనిపోయింది. దేవి తండా వద్ద జాతీయ రహదారిపై (national highway) 2022 ఫిబ్రవరి నెలలో ఆర్టీసీ బస్సు (RTC bus hits) ఢీకొని మరో చిరుత మృతి చెందింది. గతేడాది చంద్రాయన్‌పల్లి, దగ్గి అటవీ ప్రాంతాల మధ్య కారు ఢీకొనడంతో ఓ చిరుత పులి తీవ్రంగా గాయపడింది. చంద్రాయన్‌పల్లి పెద్దమ్మ ఆలయం వద్ద ఆరు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో మరో చిరుత చనిపోయింది. బుధవారం తెల్లవారుజామున చంద్రాయ న్‌పల్లి (Chandrayanpally) వద్ద మరో చిరుత మృతి చెందింది.

    READ ALSO  Indur Tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    Leopard | జాతీయ రహదారిపైనే అధికం..

    ఇందల్వాయి మండలం (Indalwai mandal) మీదుగా జాతీయ రహదారి 44 (National Highway 44) ఉంది. కాగా.. ఈ మార్గంలో అటవీ ప్రాంతం (forest area) విస్తరించి ఉంది. రోడ్డుకు ఇరువైపులా అటవీ ప్రాంతం ఉండడంతో రోడ్డును దాటే క్రమంలో చిరుతలు హైవేపై వాహనాలు ఢీకొని మృతి చెందుతున్నాయి.

    Leopard | చెట్లు నరకడంతో..

    అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు అడవులను వదిలి బయటకు వస్తున్నాయి. కొందరు అక్రమార్కులు చెట్లను నరికివేసి వ్యవసాయ భూములుగా (agricultural lands) మారుస్తున్నారు. దీంతో వన్యప్రాణులు అడవిని వదిలి బయటకు వస్తున్నాయి. మరోవైపు వేసవిలో వన్యప్రాణుల తాగునీటి (drinking water) కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

    Leopard | కంచె ఏర్పాటు చేయాలి

    చంద్రాయన్‌పల్లి నుంచి దగ్గి (Chandrayanpally to Daggi) వరకు సుమారు ఐదు కి.మీ. మేర 44వ జాతీయ రహదారికి ఇరుపక్కల దట్టమైన అడవి ఉంది. అర్ధరాత్రి వేళ వన్యప్రాణులు (wild animals) అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్తుంటాయి. వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా కంచె ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఉంది.

    READ ALSO  Nizamabad city | దర్జాగా కబ్జా.. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు.. మాజీ కార్పొరేటర్​ నిర్వాకం

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...