అక్షరటుడే, వెబ్డెస్క్:Pavan Kalyan | భారత ఆర్మీ(Indian Army) చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pavan Kalyan) స్పందించారు. పహల్ గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీవోకే(India POK), పాక్(Pakistan)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ మాట్లాడుతూ.. భారతీయులు గర్వ పడేలా మోదీ జవాబు ఇచ్చారన్నారు. మనం అందరం మోదీ(PM Modi)తో పాటు భారత ఆర్మీకి అండగా నిలవాల్సిన సమయం ఇది అన్నారు. అలా కాకుండా ఎవరైన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియా(Social Media)లో అరవొద్దన్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు దేశ భద్రత, సరిహద్దుల్లో పరిస్థితుల గురించి తెలియకుండా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
