అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడిపై pahalgam terror attack ప్రతీకారంతో ఉన్న భారత్ చెప్పి మరి పాక్పై దాడి చేసింది.
ఉగ్రవాదులకు గట్టిగా బదులిస్తామని భారత ప్రధాని మోదీ PM Modi ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్కు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ హింట్ ఇచ్చింది. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై దాడికి కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
‘రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్’ ready to strike.. ready to win అనే క్యాప్షన్తో మంగళవారం అర్ధరాత్రి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ తర్వాతి 15 నిమిషాలకే భారత వాయుసేన పాక్, పీవోకేలోని ఉగ్రశిబిరాలపై terrorist camps విరుచుకు పడింది. కాగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.