అక్షరటుడే, వెబ్డెస్క్:Opration Sindoor | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. పీవోకేతో పాటు పాక్(Pakistan)లోని పలు ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(Cabinet Committee) కీలక సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh), హోమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) మోదీకి వివరించారు.
జమ్మూకశ్మీర్ సీఎంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సరిహద్దులో భద్రతపై ఒమర్ అబ్దుల్లా(Ober Abdullah)తో ఆయన చర్చించారు. ప్రజల కోసం అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు భద్రతా బలగాలు సైతం అప్రమత్తమయ్యాయి. పాక్(Pakistan) ప్రతి దాడి చేసి అవకాశం ఉండడంతో సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇప్పటికే పాక్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. మరోవైపు భారత సైనికులకు సెలవులు రద్దు చేస్తూ రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని సూచించింది.