అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను బుధవారం ఉదయం వారు వెల్లడించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉందని, లాష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసిందన్నారు.
పార్లమెంట్ దాడి నుంచి పహల్గామ్ వరకు ఉగ్రదాడుల్లో 350 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ముంబయి దాడుల తర్వాత పహల్గామ్ రెండో పెద్ద దాడి. ఇందులో 26 మంది మృతి చెందారు.. కశ్మీర్లో శాంతిని భగ్నం చేయడానికే ఈ దాడి చేశారని చెప్పారు. దీంతో భారత్ తన అధికారాన్ని ఉపయోగించి, పాక్సరిహద్దును దాటి దాడి చేసిందన్నారు.
Operation Sindoor | అందుకే ఆపరేషన్
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లో మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని మిస్త్రీ అన్నారు. అందుకే సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై పాక్ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఉగ్రదాడి చేసిన వారిని కుట్రదారులను, దాని వెనుక ఉన్న వారిని గుర్తించామని ఆయన వెల్లడించారు. దాడికి పాల్పడ్డ వారికి ఖచ్చితంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
Operation Sindoor | ఉగ్ర శిబిరాలను గుర్తించి.. దాడులు
పాకిస్తాన్ 3 దశబ్దాలుగా ఉగ్రవాదులకు సదుపాయాలు కల్పిస్తోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. వారి కోసం శిక్షణ శిబిరాలు, లాంచ్ ప్యాడ్స్ నిర్మించిందన్నారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాద శిబిరాలను గుర్తించి తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశామని వివరించారు.
Operation Sindoor | అక్కటే కుట్ర
నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్లోని ఎల్ఈటీ క్యాంపుపై తొలి దాడి చేశామన్నారు. ఎల్ఓసీలోని బింబల్ క్యాంపు లాష్కరే తోయిబా ఉగ్రవాడులకు ట్రైనింగ్ ఇస్తుందచి చెప్పారు. దీనిపై కూడా దాడి చేసినట్లు వివరించారు. పాకిస్తాన్లోని సర్జల్, ముర్కిదే క్యాంపుపై దాడి చేసినట్లు వివరించారు. ముర్కిదే క్యాంపులోనే ముంబై పేలుళ్లకు కుట్ర జరిగిందని, కసబ్ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడని తెలిపారు.