More
    HomeజాతీయంOperation Sindoor | వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​: కేంద్రం

    Operation Sindoor | వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​: కేంద్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పహల్గామ్​ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​ చేపట్టినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆపరేషన్​ సింధూర్​ వివరాలను బుధవారం ఉదయం వారు వెల్లడించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్త్రీ మాట్లాడుతూ.. పాక్​ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉందని, లాష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసిందన్నారు.

    పార్లమెంట్​ దాడి నుంచి పహల్గామ్​ వరకు ఉగ్రదాడుల్లో 350 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ముంబయి దాడుల తర్వాత పహల్గామ్​ రెండో పెద్ద దాడి. ఇందులో 26 మంది మృతి చెందారు.. కశ్మీర్​లో శాంతిని భగ్నం చేయడానికే ఈ దాడి చేశారని చెప్పారు. దీంతో భారత్​ తన అధికారాన్ని ఉపయోగించి, పాక్​సరిహద్దును దాటి దాడి చేసిందన్నారు.

    READ ALSO  UAE Indian Doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    Operation Sindoor | అందుకే ఆపరేషన్​

    పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్​లో మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని మిస్త్రీ అన్నారు. అందుకే సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై పాక్​ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఉగ్రదాడి చేసిన వారిని కుట్రదారులను, దాని వెనుక ఉన్న వారిని గుర్తించామని ఆయన వెల్లడించారు. దాడికి పాల్పడ్డ వారికి ఖచ్చితంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

    Operation Sindoor | ఉగ్ర శిబిరాలను గుర్తించి.. దాడులు

    పాకిస్తాన్​ 3 దశబ్దాలుగా ఉగ్రవాదులకు సదుపాయాలు కల్పిస్తోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. వారి కోసం శిక్షణ శిబిరాలు, లాంచ్​ ప్యాడ్స్​ నిర్మించిందన్నారు. పహల్గామ్​ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​ చేపట్టామన్నారు. ఇంటెలిజెన్స్​ వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాద శిబిరాలను గుర్తించి తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశామని వివరించారు.

    READ ALSO  Plane Crash | విమాన ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు.. డిప్యూటీ తహశీల్దార్​ అరెస్ట్​

    Operation Sindoor | అక్కటే కుట్ర

    నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్​లోని ఎల్ఈటీ క్యాంపుపై తొలి దాడి చేశామన్నారు. ఎల్ఓసీలోని బింబల్ క్యాంపు లాష్కరే తోయిబా ఉగ్రవాడులకు ట్రైనింగ్ ఇస్తుందచి చెప్పారు. దీనిపై కూడా దాడి చేసినట్లు వివరించారు. పాకిస్తాన్​లోని సర్జల్, ముర్కిదే క్యాంపుపై దాడి చేసినట్లు వివరించారు. ముర్కిదే క్యాంపులోనే ముంబై పేలుళ్లకు కుట్ర జరిగిందని, కసబ్ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడని తెలిపారు.

    Latest articles

    Nvidia CEO | అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారిగా మ‌స్క్‌.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Nvidia CEO | ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపార‌వేత్త‌ల్లో ఎలాన్ మ‌స్క్(Elon Musk) మొద‌టి స్థానంలో నిలిచారు....

    PCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief | ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​ వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​ కుమార్​...

    Ration Rice | రేషన్​ కోసం లబ్ధిదారుల తిప్పలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్​ బియ్యాన్ని ఒకేసారి...

    Indigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indigo Flight | అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు...

    More like this

    Nvidia CEO | అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారిగా మ‌స్క్‌.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Nvidia CEO | ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపార‌వేత్త‌ల్లో ఎలాన్ మ‌స్క్(Elon Musk) మొద‌టి స్థానంలో నిలిచారు....

    PCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief | ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​ వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​ కుమార్​...

    Ration Rice | రేషన్​ కోసం లబ్ధిదారుల తిప్పలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్​ బియ్యాన్ని ఒకేసారి...