More
    HomeజాతీయంOperation Sindoor | ‘టెర్ర‌ర్ న‌ర్స‌రీ’గా ‘ముర్కిదే’.. ల‌ష్క‌రే తోయిబా ఇక్క‌డ నుండే ఆప‌రేష‌న్స్ చేస్తుందా..?

    Operation Sindoor | ‘టెర్ర‌ర్ న‌ర్స‌రీ’గా ‘ముర్కిదే’.. ల‌ష్క‌రే తోయిబా ఇక్క‌డ నుండే ఆప‌రేష‌న్స్ చేస్తుందా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ప‌హ‌ల్​గామ్​లో 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌కు భార‌త ఆర్మీ(Indian Army) గ‌ట్టిగా బ‌దులిచ్చింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని 9 ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మెరుపుదాడుల‌తో విరుచుకుప‌డ‌డంతో ఒక్క బహావల్‌పూర్‌(Bahawalpur)లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మందికిపైగా టెర్రరిస్ట్‌లు హతమైనట్టు తెలుస్తోంది.

    Operation Sindoor | అర్ధ‌రాత్రి దాడులు..

    ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack) వెనుకాల ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ ఉన్న‌ట్లు భార‌త సైన్యం అనుమానించింది. దీంతో ఆ సంస్థ‌కు ప్ర‌ధాన స్థావ‌ర‌మైన ముర్కిదేను భార‌త సైన్యం(Indian Army) ల‌క్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన వాణిజ్య కేంద్ర‌మైన లాహోర్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ముర్కిదే ఉంది. ముర్కిదేలో 200 ఎక‌రాల్లో ల‌ష్క‌రే తోయిబా త‌న ఉగ్ర‌స్థావ‌రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ల‌ష్క‌రే తోయిబా అనుబంధ సంస్థ జ‌మ్మ‌త్ ఉద్ దావా(Jammat-ud-Dawa) కూడా ఇక్క‌డి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్‌ India ధ్వంసం చేసింది.

    READ ALSO  Ahmadabad Plane Crash | పది నిమిషాలు ఆలస్యం.. యువతి ప్రాణాలు కాపాడింది

    ముర్కిదే ప్రాంతం టెర్ర‌ర్ న‌ర్స‌రీ(Terror Nursery)గా పేరుగాంచింది. ఈ క్యాంపును 200 ఎక‌రాల్లో విస్త‌రించి, ఉగ్ర‌వాద శిక్ష‌ణా కార్యకలాపాల‌ను కొన‌సాగిస్తున్నట్లు సమాచారం. ఇది ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు ముర్కిదే ఒక న‌ర్వ్(నాడీ) సెంట‌ర్‌గా పేరుగాంచింది. ఇక్కడే అయితే 80 నుంచి 90 మంది దాకా టెర్ర‌రిస్టులు Terrorists చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. యుద్ధంలో పాల్గొన్న ఫైటర్‌ జెట్‌లు, పైలట్లు భారత్‌కు సేఫ్‌గా తిరిగివచ్చారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరిపింది. బ‌హ‌వ‌ల్‌పూర్ జైషే మ‌హ్మ‌ద్, ముర్కిదేలోని ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద స్థావరాల‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కాగా.. ‘ఆపరేషన్ సింధూర్‌’(Operation Sindhoor)ను భారత ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) స్వయంగా పర్యవేక్షించారు. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించినట్లు తెలుస్తోంది. కాగా.. నేడు 11 గంటలకు CCS కీలక భేటీ జరగనుంది. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.

    READ ALSO  Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...