అక్షరటుడే, హైదరాబాద్: Operation Sindoor : ‘ఆపరేషన్ సింధూర్’పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ AIMIM chief Asaduddin Owaisi స్పందించారు. పాక్పై భారత్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను స్వాగతిస్తున్నాం. మరో పహల్గావ్ ఘటన జరగకుండా పాక్కు ఇదే విధంగా సరైన గుణపాఠం చెప్పాలి. పాక్ ఉగ్ర స్థావరాలన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయాలి. జై హింద్’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాగా, పాక్పై భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యంలో ఆర్మీ అధికారులు మరికొద్ది సేపట్లో ప్రెస్మీట్ లో వివరాలు వెల్లడించనున్నారు.
1971 తర్వాత అంటే.. 54 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్ భూభాగంపైకి భారత్ వైమానిక దళాలు దూసుకెళ్లాయి. అక్కడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఉగ్రవాదులను ఖతం చేశాయి.