More
    HomeతెలంగాణMetro Train Charges | మెట్రో రైలు ప్ర‌యాణికుల‌కి గుండె గుబేల్‌మ‌నే వార్త‌.. త్వరలో ఛార్జీల...

    Metro Train Charges | మెట్రో రైలు ప్ర‌యాణికుల‌కి గుండె గుబేల్‌మ‌నే వార్త‌.. త్వరలో ఛార్జీల మోత‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Metro Train Charges | నగరంలో నిత్యం జాబ్ చేసేందుకు ఆఫీస్‌కు వెళ్లే వారు ట్రాఫిక్‌(Traffic)లో ఎంత న‌ర‌క‌యాత‌న ప‌డుతుంటారో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే మెట్రో(Metro) వ‌చ్చాక వారికి కొంత సులువు అయింది.

    స్టూడెంట్స్ Students కూడా చాలా మంది మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. సులభ ప్రయాణం కోసం ఉద్యోగులు కూడా మెట్రో ఎక్కుతూ ఉంటారు. అయితే వీళ్లకు ఇప్పుడు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. వారం రోజుల్లో మెట్రో రైలు చార్జీలు(Hyderabad Metro Train Charges) పెరగబోతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి పెంచిన మెట్రో చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా చార్జీలను పెంచనున్నారు.

    READ ALSO  Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    Metro Train Charges | రేట్లు ఇలా ఉంటాయా..

    ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)తో మెట్రో అధికారులు భేటీ కానుండ‌గా, ఆ భేటిలో సీఎం నుంచి అనుమతి తీసుకొని పెంచిన చార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు మెట్రో యాజమాన్యం(Metro Management) సిద్ధమైంది. కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై రూ.6,598కోట్ల భారం ప‌డింది. అయితే, కొంతకాలంగా మెట్రో చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ప్రస్తుతం రోజుకు 1,200 సర్వీసులు నడుస్తుండగా.. 4.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

    ప్రస్తుతం చార్జీల కంటే 25 నుంచి 30శాతం పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. చార్జీల పెంపుతో ప్రతీయేటా రూ.150 నుంచి 170 కోట్ల వరకు వార్షిక ఆదాయం రాబట్టుకోవాలని, తద్వారా కొంతైనా నష్టాల భారాన్ని తగ్గించుకోవచ్చునని మెట్రో యాజమాన్యం(Metro Management) భావిస్తోంది.

    READ ALSO  Hydraa | నాలాల ఆక్రమణలపై హైడ్రా చర్యలు.. కృష్ణానగర్​లో కూల్చివేతలు

    రెండు కిలో మీటర్ల దూరం వరకు ప్రస్తుతం ఛార్జీ రూ.10 ఉండగా.. రూ.15కు పెరిగే అవకాశం ఉంది. 2 నుంచి 4 కిలో మీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.15 ఉండగా.. రూ. 20కి పెరిగే అవకాశం ఉంది. అలాగే 4 నుంచి 6 కిలోమీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.25 ఉండగా.. రూ. 35 వరకు పెరిగే అవకాశం ఉంది. 6 నుంచి 8 కిలో మీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.30 ఉంది. రూ.40 పెరిగే అవకాశం. 8 నుంచి 10 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ.35 ఉంది. రూ. 45కు పెరిగే అవకాశం ఉంది.

    10 నుంచి 14 కిలో మీటర్లకు రూ.55కు, 14నుంచి 18 కిలో మీటర్లకు రూ.60కు, 18 నుంచి 22 కిలో మీటర్లకు రూ.65కు, 22 నుంచి 26 కిలో మీటర్లకు రూ.70కు, 26 కిలో మీటర్లకుపైన రూ.75కు పెరిగే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

    READ ALSO  PCC Chief | కేసీఆర్​ పెద్ద తప్పు చేశారు : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    Latest articles

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...

    More like this

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...