అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట (Lingampet) మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో (Boys’ High School) 1998–99 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 26 ఏళ్ల తర్వాత ఒక్కోచోట కలుసుకున్నారు. ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. స్థానిక మోహిన్ బాబా ఖాద్రీ ఫంక్షన్ హాల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రామా గౌడ్, ప్రభు లింగం, టీఎల్ రావు, బుచ్చిరెడ్డి, గంగాధర్లను ఘనంగా సన్మానించారు.
Alumni Association | మిత్రుల కుటుంబాలకు సాయం
తమ బ్యాచ్లో మృతిచెందిన నలుగురు మిత్రుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. అలాగే 2025లో పదో తరగతిలో మండల టాపర్గా నిలిచిన మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థి నిక్షయ్కు రూ.3వేల నగదు బహుమతి అందజేశారు. శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన విద్యార్థికి రూ.3000 నగదు ప్రోత్సహ బహుమతి ఇచ్చారు. 26 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు.