అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని గౌలిగూడలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోకి గొల్ల రుకుంబాయి అనే మహిళ ఇంట్లో రోజూ వింత శబ్దాలు వస్తున్నాయి. దీంతో కాలనీవాసులు ఆమెను ప్రశ్నించగా బాత్రూం నిర్మాణం కోసం ఇంట్లో తవ్వకాలు జరుపుతున్నట్లు పేర్కొంది.
అయితే శనివారం రాత్రి సైతం వింత శబ్దాలు రావడంతో వారంతా ఆమెను ప్రశ్నించారు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా పెద్ద గోతి తవ్వి అందులో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. దీంతో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే పలువురు ఈ పూజల్లో పాల్గొన్నట్లు కాలనీవాసులు తెలిపారు.