అక్షరటుడే, వెబ్డెస్క్:Miss World competitions | రాష్ట్ర ప్రభుత్వం(State Government) మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ ఈవెంట్(Event)లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీ(Miss World competitions )లు జరగనున్నాయి. మొత్తం 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొననున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మిస్ వరల్డ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు లండన్లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో(CEO), చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి(Julia Evelyn Morley) హైదరాబాద్కు చేరుకున్నారు.
Miss World competitions | అధికారుల ఘన స్వాగతం
జూలియా ఈవేలిన్ మోర్లి(Julia Evelyn Morley) శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport)లో ల్యాండ్ అయ్యారు. అమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్(Miss World)-2025 పోటీల ఏర్పాట్లను ఆమె సమీక్షించనున్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, మిస్ వరల్డ్ కంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు, ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో జూలియా మోర్లి సమీక్ష నిర్వహిస్తారు.