అక్షరటుడే, ఎల్లారెడ్డి :May Day | మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్(CITU District Secretary Venkat Goud) అన్నారు. మేడే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదుట జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్(Mahesh Kumar) హాజరయ్యారు. అనంతరం వెంకట్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం(Central Government) కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. మేం 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకన్న, దేవకర్న మహేందర్, సాయన్న, విజయేందర్, వేణు గౌడ్, శ్యామ్, సద్దాం, విజయ్, మహేందర్, సాయిబాబు, రాములు, పద్మ, శోభ, లలిత తదితరులు పాల్గొన్నారు.
May Day | విద్యుత్ శాఖ కార్యాలయంలో..
మేడే సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు 1004 యూనియన్ నాయకులు అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజా గౌడ్, కార్యదర్శి కాశీరాం, సహ కార్యదర్శి అమృనాయక్, బాలకిషన్ గౌడ్, పాండు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.